ముగ్గురు బిడ్డల తండ్రిని ప్రేమించి... వదిలుండలేక ఆత్మహత్య!
- నిన్న నడిరోడ్డుపై మంటల్లో కావ్య
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు
ఈ క్రమంలోనే బుధవారం శివాజీపాలెం రోడ్ లో నడుచుకుంటూ వెళుతున్న కావ్య, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. నడిరోడ్డుపై ఓ యువతి ఉన్నట్టుండి మంటల్లో కాలుతుండడాన్ని గమనించిన స్థానికులు, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆపై ఆమెను ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో ఉన్న కావ్య విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె కాల్ డేటాను, చాటింగ్ వివరాలను పరిశీలించిన తరువాత ప్రేమ వ్యవహారం ఈ ఆత్మహత్య వెనుక ఉందని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.