Telangana: రేపటి నుంచి బోనాల పండుగ.. ప్రత్యేక పాటను విడుదల చేసిన బిత్తిరి సత్తి!

  • రేపటి నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం
  • అమ్మవారే ఇంటికి వచ్చినట్లు భావించి పూజలు
  • ప్రత్యేక గీతాన్ని పాడిన బిత్తిరి సత్తి

తెలంగాణలో గోల్కొండ బోనాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళతారని ఓ నమ్మకం. అందుకే భక్తులు బోనాల పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ బోనాల పండుగ రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు, యాంకర్ బిత్తిరి సత్తి బోనాలపై పాడిన ప్రత్యేక పాటను విడుదల చేశారు. ఈ పాటను డా. కందికొండ రాయగా, భోలే షావలి సంగీతం సమకూర్చారు. ఈ పాటను మీరూ చూసేయండి.

  • Loading...

More Telugu News