shankar: స్టార్ హీరోల వారసులతో శంకర్ మూవీ?

  • ఆగిపోయిన 'భారతీయుడు 2' ప్రాజెక్టు
  •  ధృవ్ - జేసన్ హీరోలుగా శంకర్ సినిమా
  •  త్వరలో ప్రకటన వెలువడే ఛాన్స్ 

రజనీతో చేసిన '2.ఓ' ఆశించినస్థాయి ఫలితాన్ని రాబట్టకపోయినా, శంకర్ డీలాపడినట్టుగా కనిపించలేదు. పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే కమల్ తో 'భారతీయుడు 2' ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చేవారు లేరు.

ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. సీనియర్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' .. స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ కథానాయకులుగా ఒక సినిమాను రూపొందించే పనిలో శంకర్ వున్నాడని చెప్పుకుంటున్నారు. స్టార్ హీరోల వారసులు కావడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

  • Loading...

More Telugu News