naveen: అలాంటిదేం లేదన్న 'రంగస్థలం' నిర్మాత


కథలో బలం .. కథనంలో కొత్తదనం కలిగిన సినిమాలు చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు మొదటినుంచి ప్రత్యేకమైన దృష్టిపెడుతూ వస్తున్నారు. ఈ కారణంగానే ఈ బ్యానర్లో 'శ్రీమంతుడు' .. 'జనతా గ్యారేజ్' .. 'రంగస్థలం' వంటి భారీ విజయాలు కనిపిస్తాయి. ఈ బ్యానర్ ప్రతిష్ఠను కాపాడటానికి నిర్మాతలైన నవీన్ యెర్నేని .. రవిశంకర్ .. సీవీ మోహన్ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.

అలాంటి ఈ ముగ్గురిలో ఒకరైన నవీన్ యెర్నేని వేరేగా ఒక బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ముఖ్యంగా ఫిల్మ్ నగర్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, తనకి అలాంటి ఉద్దేశమే లేదనే విషయం చెప్పారు. మైత్రీ బ్యానర్లోనే తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు స్పష్టం చేశారు. దాంతో జోరుగా జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిపోయింది.

  • Loading...

More Telugu News