Cricket: వరుణుడి కారణంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం

  • బర్మింగ్ హామ్ లో వాన
  • చిత్తడిగా మారిన మైదానం
  • ఇంకా టాస్ వేయని వైనం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడి ప్రభావం చాలా ఉంది. అనేక జట్ల సెమీస్ అవకాశాలు వాన కారణంగా తారుమారు అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, మరోసారి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బర్మింగ్ హామ్ లో జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. మైదానం చిత్తడిగా ఉండడంతో ఇంకా టాస్ వేయలేదు. మ్యాచ్ నిర్ణీత సమయం కంటే గంటన్నర ఆలస్యంగా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News