Hyderabad: హైదరాబాద్ లో కొలువైన మరో శిల్పారామం

  • ఉప్పల్ వద్ద మూసీ నదీతీరంలో మినీ శిల్పారామం ఏర్పాటు
  • నేడు ప్రారంభోత్సవం
  • ట్వీట్ చేసిన కేటీఆర్

హైదరాబాద్ లో ఇప్పటికే ఓ శిల్పారామం ఉండగా, నగర తూర్పుప్రాంతానికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఉప్పల్ లో మినీ శిల్పారామం నిర్మించారు. ఏడాది క్రితం దీనికి శంకుస్థాపన జరగ్గా, ఈ సాయంత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఉప్పల్ వద్ద మూసీ నదీ తీరంలో ఏర్పాటైన ఈ తాజా శిల్పారామం ప్రారంభోత్సవంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ నగర తూర్పు ప్రాంతంలో కూడా ఓ శిల్పారామం ఏర్పాటవడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఇక మీదట పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవడంతో పాటు జీవన నాణ్యత ప్రమాణాలు కూడా ఉన్నతీకరణ చెందుతాయని కేటీఆర్ వివరించారు.

  • Loading...

More Telugu News