Australia: శాంతించిన వరుణుడు... బంగ్లాదేశ్ టార్గెట్ 382 రన్స్

  • పునఃప్రారంభమైన ఆట
  • చివరి ఓవర్లో 13 రన్స్ సాధించిన ఆసీస్
  • స్కోరు 50 ఓవర్లలో 5 వికెట్లకు 381 పరుగులు

నాటింగ్ హామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆసీస్ 5 వికెట్లకు 381 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. వర్షం వల్ల 49 ఓవర్ వద్ద ఆట నిలిచిపోగా, కాసేపటి తర్వాత వరుణుడు శాంతించడంతో మిగిలిన ఒక్క ఓవర్ పూర్తిచేశారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆసీస్ బ్యాట్స్ మెన్ 13 పరుగులు పిండుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. వార్నర్, ఫించ్, ఖవాజా, మ్యాక్స్ వెల్ వంటి ఆటగాళ్లు బ్యాట్లు ఝుళిపించడంతో పరుగులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా వార్నర్ (166) శతకంతో చెలరేగిపోయాడు. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ కు 3 వికెట్లు దక్కాయి.

  • Loading...

More Telugu News