jagan: వైసీపీ నేత మోషేన్ రాజు కుమారుడి వివాహానికి హాజరైన జగన్

  • ఉండిలో వివాహానికి హాజరైన జగన్
  • అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టుకు బయల్దేరిన సీఎం
  • సీఎం హోదాలో పోలవరంను తొలిసారి సందర్శిస్తున్న జగన్

పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో వైసీపీ నేత మోషేన్ రాజు కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టుకు బయల్దేరారు. ముఖ్యమంత్రి హోదాలో పోలవరంను జగన్ సందర్శిస్తుండటం ఇదే తొలిసారి. గతంలో రెండు సార్లు ఆయన ఈ ప్రాజెక్టును సందర్శించారు. 2011లో హరితయాత్ర పేరుతో ఆయన తొలిసారి ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం 2015లో ప్రాజెక్టుల సాధన పేరిట వైసీపీ ఎమ్మెల్యేలతో కలసి బస్సు యాత్రను నిర్వహించారు.

  • Loading...

More Telugu News