Chiranjeevi: 'కౌసల్య కృష్ణమూర్తి' హీరోయిన్ మా కొలీగ్ కూతురే అని తెలిసి ఎంతో సంతోషం కలిగింది: చిరంజీవి

  • టీజర్ లాంచ్ చేసిన చిరంజీవి
  • ఐశ్వర్య కుటుంబీకులను ప్రస్తావించిన మెగాస్టార్
  • సినిమా కోసం ఆమె తపనకు మెచ్చుకోలు

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం టీజర్ రిలీజైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్ గా అద్భుతంగా నటించిందని కితాబిచ్చారు. సినిమాలో క్రికెటర్ పాత్ర కోసం నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకుని సెట్స్ మీదకు రావడం ఆమె అంకితభావానికి నిదర్శనం అని మెచ్చుకున్నారు. ఐశ్వర్య రాజేశ్ తమ కొలీగ్ రాజేశ్ కుమార్తేనని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని, ఐశ్వర్య మేనత్త, కమెడియన్ శ్రీలక్ష్మి అందరికీ తెలిసిన వ్యక్తేనని, వారి వారసురాలుగా ఐశ్వర్య ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

 ఇక సినిమా గురించి చెబుతూ, ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారని, మనవద్ద కూడా ఆ స్థాయిలో ప్రోత్సాహం అవసరమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ఐశ్వర్య రాజేశ్ తో చిరంజీవి వీడియో కాల్ లో మాట్లాడారు. మీ నాన్న రాజేశ్, మీ మేనత్త శ్రీలక్ష్మి మాకు బాగా తెలుసమ్మా అంటూ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను అభినందించారు.

  • Loading...

More Telugu News