Andhra Pradesh: అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణం: మంత్రి బొత్స

  • దీనిపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం
  •  ఏ నిర్మాణాలు జరిగాయో విచారణలో తేలుతుంది
  • ‘హోదా’ సాధన విషయంలో బాబు సలహాలు అక్కర్లేదు

అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరిగాయో తమ విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ వ్యవహారంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News