Andhra Pradesh: ప్రత్యేక హోదాపై మేమెప్పుడూ వెనక్కి వెళ్లలేదు: అచ్చెన్నాయుడు

  • విభజన తర్వాత ‘హోదా’ కావాలని అందరూ కోరుకున్నారు
  • ‘హోదా’ కోసమే ప్రజలు వైసీపీకి అధికారమిచ్చారు
  • వైసీపీ ‘హోదా’ను కచ్చితంగా సాధించాలి

రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కావాలని ఐదు కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కోరుకున్నాయని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని ప్రజలు కోరుకోవడం వల్లే ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారని అన్నారు. కనుక, ‘హోదా’ను కచ్చితంగా సాధించాలని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సూచించారు. 

Andhra Pradesh
Telugudesam
mla
atchanaidu
  • Error fetching data: Network response was not ok

More Telugu News