Andhra Pradesh: చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారు.. ఇకపై యూపీఏతో పనిచేయరట!: విజయసాయిరెడ్డి

  • కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట
  • ఇది మోదీ, షా ముందు మోకరిల్లడమే
  • ట్విట్టర్ లో స్పదించిన వైసీపీ సీనియర్ నేత

ఆంధ్రప్రదేశ్, లోక్ సభ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోకముందే టీడీపీ అధినేత చంద్రబాబు మరో యూటర్న్ తీసుకున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇకపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో కొనసాగకూడదని బాబు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు విరామం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని ఎద్దేవా చేశారు.

ఇదంతా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ముందు మోకరిల్లే ప్రయత్నమేనని స్పష్టం చేశారు. ముగ్గురు లోక్ సభ సభ్యులతో చంద్రబాబు ఎన్ని యూటర్నులు తీసుకున్నా, ఆయన్ను పట్టించుకునేవారే ఉండరని తేల్చిచెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

  • Loading...

More Telugu News