వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ‘బంట్రోతు’ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ!
- గవర్నర్ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదు
- అధికార, విపక్ష సభ్యులంతా ప్రజలకు బంట్రోతులే
- ఏపీ అసెంబ్లీ వద్ద మీడియాతో హిందూపురం ఎమ్మెల్యే
‘ఎవరు అయితేనేం.. మనం ప్రజా సేవకులం. అధికారంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉండొచ్చు. అందరూ ప్రజల బంట్రోతులే. ప్రజల కోసం కష్టపడటానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులం’ అని వ్యాఖ్యానించారు. ఈ 15 రోజుల వైసీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అని మీడియా ప్రశ్నించగా, ‘మరికొంత కాలం వేచిచూద్దాం’ అని బాలయ్య జవాబిచ్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.