Cricket: బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యం... ఇంగ్లాండ్ 386/6

  • జాసన్ రాయ్ విధ్వంసక శతకం
  • మెరుపు ఇన్నింగ్స్ లతో అలరించిన వోక్స్, ప్లంకెట్
  • చెరో రెండు వికెట్లు దక్కించుకున్న సైఫుద్దీన్, మెహదీ హసన్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కళ్లుచెదిరే రీతిలో భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ (153) భారీ సెంచరీతో రాణించగా, బెయిర్ స్టో (51), జోస్ బట్లర్ (64), ఇయాన్ మోర్గాన్ (35) సమయోచితంగా బ్యాట్లు ఝుళిపించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 386 పరుగులు సాధించింది. చివర్లో ఆల్ రౌండర్లు క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్ మెరుపుదాడి చేయడంతో ఇంగ్లాండ్ స్కోరు 350 దాటింది. వోక్స్ 8 బంతుల్లో 2 సిక్స్ లతో 18, ప్లంకెట్ 9 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 27 పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సైఫుద్దీన్, మెహదీ హసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

  • Loading...

More Telugu News