Cricket: బంగ్లాదేశ్ బౌలర్లను చితకబాది సెంచరీ పూర్తిచేసుకున్న జాసన్ రాయ్

  • భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్
  • బెయిర్ స్టో అర్ధసెంచరీ
  • కార్డిఫ్ లో వరల్డ్ కప్ మ్యాచ్

కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ఓపెనర్ జాసన్ రాయ్ అద్భుత సెంచరీతో రాణించి మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. రాయ్ 121 బంతుల్లో 14 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 153 పరుగులు చేసి అలరించాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉన్నంత సేపు బంగ్లాదేశ్ బౌలర్ల దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

అయితే ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ అతడిని అవుట్ చేయడంతో బంగ్లా జట్టు ఊపిరిపీల్చుకుంది. జాసన్ రాయ్ తాను అవుట్ కావడానికి ముందు వరుసగా మూడు బంతులను స్టాండ్స్ లోకి పంపాడు. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 51 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 35 ఓవర్లలో 3 వికెట్లకు 236 పరుగులు. క్రీజులో జోస్ బట్లర్ కు తోడుగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వచ్చాడు.

  • Loading...

More Telugu News