modi: శ్రీకృష్ణుడికి తులాభారం సమర్పించిన మోదీ

  • కేరళ పర్యటనలో ఉన్న మోదీ
  • గురువాయూర్ క్షేత్రాన్ని దర్శించిన ప్రధాని
  • శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు

దేశ ప్రధానిగా రెండోసారి బాధ్యతలను చేపట్టిన అనంతరం తొలిసారి కేరళలో మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ గురువాయూర్ క్షేత్రాన్ని ఆయన దర్శించారు. ప్రధానికి ఆలయ అధికారులు, పురోహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తులాభారం నిర్వహించారు. తన ఎత్తు కలువపూలను స్వామివారికి సమర్పించారు. కేరళ పర్యటన అనంతరం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని మోదీ దర్శించుకోనున్నారు.

  • Loading...

More Telugu News