jagan: తన కార్యాలయం నుంచి జగన్ తొలి ట్వీట్ ఇదే

  • సెక్రటేరియట్ లో అడుగుపెట్టిన జగన్
  • వేద మంత్రోచ్చారణ మధ్య సీటులో ఆసీనులైన సీఎం
  • అందరి అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తానంటూ ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఉదయం 8.39 నిమిషాలకు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. పురోహితుల వేద మంత్రోచ్చారణ మధ్య తన సీటులో ఆసీసులయ్యారు. అనంతరం మూడు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన సెక్రటేరియట్ నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తొలి ట్వీట్ చేశారు. 'భగవంతుడు, మీ అందరి ఆశీస్సులతో మీ ఆకాంక్షలను నెరవేర్చుతా. మీ అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలను నిర్వహిస్తా' అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

  • Loading...

More Telugu News