Andhra Pradesh: ఫిలింఛాంబర్ లో రామానాయుడి విగ్రహం ఏర్పాటు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b2c313373bf15608e18300801578f5006771c8fe.jpg)
- నేడు రామానాయుడు జయంతి
- విగ్రహాన్ని ఆవిష్కరించిన నిర్మాత సురేష్ బాబు
- కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, పరుచూరి
మూవీ మొఘల్ రామానాయుడు జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, జి.ఆదిశేషగిరి రావు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-b2775f228aea15b983cf4b6dcf90d8824dea5e9c.jpg)