gunturu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

  • తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ
  • తమపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలన్న నేతలు
  • పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేతగా మిథున్‌రెడ్డి నియామకం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నాయకునిగా నియమితులైన మిధున్‌రెడ్డిలు ఈరోజు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరిద్దరూ సీఎంకు పుష్పగుచ్చం అందించి, తమకు పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సభల్లో పార్టీ గళం సమర్ధంగా వినిపిస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News