Cricket: కొనసాగుతున్న చాహల్ మాయాజాలం... 7 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • దక్షిణాఫ్రికా 44 ఓవర్లలో 190/7
  • క్రీజులో మోరిస్, రబాడా
  • సౌతాంప్టన్ లో భారత్ జోరు

వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అమోఘంగా రాణిస్తున్నారు. సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న పోరులో లెగ్ స్పిన్నర్ చాహల్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా రాణించడంతో ఈ పిచ్ పై భారీ షాట్లు కొట్టలేక సఫారీలు సతమతమవుతున్నారు. 44 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 7 వికెట్లకు 190 పరుగులే. ప్రస్తుతం క్రీజులో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ కు తోడు కగిసో రబాడా ఆడుతున్నాడు. మోరిస్ 28, రబాడా 12 పరుగులు చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభంలో బుమ్రా ధాటికి దక్షిణాఫ్రికా ఓపెనర్లు పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News