Cricket: టాస్ ఓడిన టీమిండియా... ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా

  • భారత జట్టులో కేదార్ జాదవ్ కు స్థానం
  • విజయ్ శంకర్ బెంచ్ కే పరిమితం
  • సౌతాంప్టన్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియాను టాస్ వెక్కిరించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా సారథి ఫాఫ్ డు ప్లెసిస్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టుకు ఛేజింగ్ లో మంచి రికార్డు ఉండడంతో అభిమానులు మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పోరుకోసం భారత జట్టులో ఆశ్చర్యకరమైన మార్పులేవీ లేవు. ఆల్ రౌండర్ కోటాలో కేదార్ జాదవ్ కు స్థానం దక్కింది. విజయ్ శంకర్ వరల్డ్ కప్ అరంగేట్రం కోసం మరో మ్యాచ్ వరకు ఎదురుచూడాల్సిందే. కాగా, గత రెండు మ్యాచ్ లలో ఓటములు పలకరించిన నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలని సఫారీలు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News