Guntur District: గుంటూరు జిల్లాలో 1000 ఏళ్ల నాటి పురాతన విగ్రహం లభ్యం

  • మాచర్ల సమీపంలో జైన తీర్థంకర విగ్రహం వెలికితీత
  • 11వ శతాబ్దం నాటిదిగా భావిస్తున్న వైనం
  • కల్యాణి చాళుక్య శైలిలో ఉన్న విగ్రహం

విజయవాడ, అమరావతి సాంస్కృతిక కేంద్రం (సిసీవీఏ) ఓ ప్రాచీన విగ్రహాన్ని కనుగొంది. గుంటూరు జిల్లాలోని మాచర్ల పట్టణం సమీపంలో 1000 ఏళ్ల నాటి విగ్రహాన్ని వెలికితీశారు. ఇది ఏడో జైన తీర్థంకర సుపార్శ్వనాథ  విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విగ్రహం కల్యాణి చాళుక్య శైలిలో కనువిందు చేస్తోంది. ఇది 11వ శతాబ్దానికి చెందిన విగ్రహంగా భావిస్తున్నట్టు సీసీవీఏ సీఈఓ శివనాగిరెడ్డి వివరించారు. శైవ, వైష్ణవ ప్రాబల్య ప్రాంతమైన మాచర్లలో జైన మత ఆధారాలు లభ్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News