Guntur District: గుంటూరు జిల్లాలో కుప్పకూలిన కోల్డ్ స్టోరేజి గోడౌన్

  • దుగ్గిరాల వద్ద ఘటన
  • ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లోపల 20 మంది కూలీలు
  • కూలీలకు తప్పిన ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఓ కోల్డ్ స్టోరేజి గోడౌన్ కుప్పకూలింది. దుగ్గిరాల సమీపంలోని జీవీఆర్ కోల్డ్ స్టోరేజీ గోడౌన్ ఉన్నట్టుండి కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లోపల 20 మంది వరకు కూలీలు పనిచేస్తున్నారు. అయితే వారందరికీ ఎలాంటి ఆపద కలగలేదు. ఈ ఘటనలో దాదాపు 2,000 పసుపు కొమ్ముల బస్తాలకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News