nikhil: 'కార్తికేయ 2'కి రంగం సిద్ధం

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • సీక్వెల్ కి సన్నాహాలు మొదలు
  • నిఖిల్ బర్త్ డే సందర్భంగా ప్రకటన

నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'కార్తికేయ' ఒకటిగా కనిపిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. ఒక వైపున లవ్ ను .. మరో వైపున సస్పెన్స్ ను కలుపుతూ తెరపై ఆవిష్కరించబడిన ఈ సినిమా యూత్ కి బాగా నచ్చేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన హీరోకి .. దర్శకుడికి ఉన్నప్పటికీ అందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది.

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. రేపు నిఖిల్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శక నిర్మాతలు 'కార్తికేయ 2' ప్రకటన చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. చందూ మొండేటి 'కార్తికేయ' చివరిలోనే సీక్వెల్ వుంటుందనే సంకేతాలనిచ్చాడు. అక్కడి నుంచే రెండవ భాగం మొదలవుతుందన్న మాట.

  • Loading...

More Telugu News