తిరుమలకు నడిచివెళ్లి తలనీలాలు సమర్పించుకున్న గోపాలకృష్ణ ద్వివేది!
- విజయవంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
- అదనపు సీఈఓతో కలిసి నడిచిన ద్వివేది
- స్వామికి మొక్కులు చెల్లింపు
ఆపై వారిద్దరూ స్వామివారికి తలనీలాలు సమర్పించి, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ద్వివేది, పోలింగ్ శాతం పెరిగిన విషయంలో ఇండియాలోనే ఏపీ రెండో స్థానంలో ఉందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 80.3 శాతం పోలింగ్ నమోదైందని, మహిళా ఓటింగ్, వికలాంగులు, పోస్టల్ బ్యాలెట్ వంటి అన్ని విభాగాల్లోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయని అన్నారు.