kantarao: కాంతారావుగారు వుంటేనే ఆ సీన్ చేస్తానని మోహన్ బాబు అన్నారట: కాంతారావు కుమారుడు రాజా

  • మా నాన్నగారంటే మోహన్ బాబుకి ఇష్టం
  • ఆ పాత్రను నాన్నతోనే చేయించాలని పట్టుబట్టారు
  • గంట షూటింగుకి 15 వేలు ఇప్పించారు

తాజా ఇంటర్వ్యూలో కాంతారావు తనయుడు రాజా మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "మొదటి నుంచి కూడా మా నాన్నగారంటే మోహన్ బాబుగారికి చాలా ఇష్టం. ఆయనలోని క్రమశిక్షణను నాన్నగారు మెచ్చుకునేవారు. మా నాన్నగారు చివరిసారిగా మేకప్ వేసుకున్న చిత్రం బాలకృష్ణ హీరోగా చేసిన 'పాండురంగ మహాత్మ్యం'.

ఆ సినిమాలో మోహన్ బాబు గారు 'కుక్కుట మహాముని' పాత్రను పోషించారు. ఆయన ఒక సీన్లో తన తండ్రి కాళ్లు పడుతూ ఉండాలి. తన తండ్రి పాత్రను కాంతారావుగారు చేస్తేనే తను కుక్కుట మహాముని పాత్రను చేస్తానని మోహన్ బాబు తేల్చి చెప్పారట. దాంతో ఆ పాత్రకి నాన్నగారిని తీసుకున్నారు. ఒకేరోజు .. ఒక గంట షాట్ .. నాన్నగారికి పారితోషికంగా 15 వేలను మోహన్ బాబు గారు ఇప్పించారు. డబ్బు విషయం పక్కన పెడితే, నాన్నగారికి ఆయన ఇచ్చిన గౌరవం గొప్పది" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News