janasena: ‘జనసేన’ అధినేత పవన్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్ ఫైర్!

  • జగన్ గురించి ఓ వీధిరౌఢీలా వెలగపూడి మాట్లాడారు
  • జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీనీ చిత్తుగా ఓడిస్తాం
  • ప్రజలు పవన్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వలేదు

విశాఖపట్టణం తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రచార రథంపై నుంచి రామకృష్ణబాబు జగన్ ని అగౌరవపరిచేలా మాట్లాడారు, ఈ విషయమై అమర్నాథ్ మాట్లాడుతూ, ఓ వీధిరౌఢీలా వెలగపూడి మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఆరోజున అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా జగన్ పై అసభ్యకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీనీ చిత్తుగా ఓడిస్తామని అన్నారు.

వెలగపూడికి దమ్ముంటే ఈ ఎన్నికల్లో తన సత్తా చూపించాలని సవాల్ విసిరారు. విశాఖ భూ కుంభకోణంలో పాత్రధారులను అవినీతి, అక్రమాలకు పాల్పడినవారినెవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని జగన్ ని ఓడించాలని పవన్ పిలుపు నిచ్చారని మండిపడ్డారు. అందుకే, ప్రజలు పవన్ ను అసెంబ్లీ గడప తొక్కనివ్వకుండా చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News