Pawan Kalyan: ఏంచేద్దాం..! పార్టీ నాయకులతో సమావేశమైన పవన్ కల్యాణ్

  • ఫలితాల తర్వాత రోజే సమీక్ష
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చ
  • వచ్చే నెల మంగళగిరిలో పార్టీ సమావేశాలు

జనసేన పార్టీకి ఈ ఎన్నికలు ఓ పాఠంలాంటివని చెప్పుకోవాలి. సుదీర్ఘకాల లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్నా, ఈ ఎన్నికలతో జనసేన భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఓ పార్టీ నిర్వహణ అనేది ఎంతో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పవన్ కల్యాణ్ జనసేన నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు.

మంగళగిరిలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాల అభ్యర్థులు తమ ఫలితాలపై పవన్ కు వివరించారు. ఎన్నికల సరళిపై తమ అభిప్రాయాలను నివేదించారు. జూన్ నెలలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలుపొందారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తో సహా మిగతా అభ్యర్థులందరూ పరాజయం పాలయ్యారు.

  • Loading...

More Telugu News