Andhra Pradesh: సాక్షాత్తూ స్పీకర్ నే చొక్కా విప్పి కొట్టారంటే ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతుంది!: సోము వీర్రాజు

  • టీడీపీతో పోత్తు కారణంగా నష్టపోయాం
  • సంక్లిష్ట పరిస్థితుల్లో జగన్ గెలిచారు
  • మేం ఏం చేయాలో అదే చేశాం

టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీ, జనసేనలు తీవ్రంగా నష్టపోయాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. చంద్రబాబు ఏరోజు ఏ పార్టీ దగ్గరకు వెళతాడో ఎవ్వరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఈసారి టీడీపీకి కనీసం 30 సీట్లు రావని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. రాజమండ్రిలో ఈరోజు ఓ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

గత నాలుగేళ్లుగా టీడీపీ అరాచకాలను ఏపీ ప్రజలు మౌనంగా చూస్తూ వచ్చారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ ఘనవిజయం సాధించారని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేయాలో అది చేసిందని చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఇనిమెట్లలో సాక్షాత్తూ అప్పటి ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును చొక్కా విప్పి కొట్టారంటే ప్రజల్లో ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News