Telugudesam: ప్రతిపక్ష హోదాను దక్కించుకున్న టీడీపీ!

  • 1994లో కాంగ్రెస్‌కు దక్కని విపక్ష హోదా
  • ఉమ్మడి రాష్ట్రంలో 26 సీట్లకే పరిమితం
  • ఇప్పుడు టీడీపీకి 23 సీట్లు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అయింది. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ విపక్ష హోదా అయినా దక్కడంతో ఊపిరి పీల్చుకుంది. ఈ ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడం కొంతలో కొంత మెరుగని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాలకే పరిమితమైంది. మొత్తం స్థానాల్లో పదో వంతు సీట్లలో కూడా విజయం సాధించకపోవడంతో ఆ పార్టీకి విపక్ష హోదా కూడా దక్కలేదు. అప్పట్లో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 30 సీట్లు రావాలి. కానీ 4 సీట్ల ముందే ఆగిపోవడంతో విపక్ష హోదాకు నోచుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలను అతి కష్టం మీద దక్కించుకుంది. దీంతో కనీసం విపక్ష హోదా అయినా దక్కిందని నేతలు సంతోష పడుతున్నారు.

  • Loading...

More Telugu News