BJP: మోదీ అధ్యక్షతన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

  • సాయంత్రం 5.30 గంటలకు భేటీ
  • పార్టీ విజయంపై మాట్లాడనున్న ప్రధాని
  • రాజస్థాన్‌లో విజయంతో బీజేపీలో జోష్‌

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ఇటీవల ఓడిన రాజస్థాన్‌లో స్వల్పకాలంలో మళ్లీ మంచి ఫలితాలు సాధించడంతో మంచి జోష్‌లో ఉన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈరోజు సాయంత్రం మోదీ అధ్యక్షతన సమావేశం కానుంది. సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగే సమావేశంలో మోదీ పార్టీ ప్రతినిధులనుద్దేశించి మాట్లాడనున్నారు.

గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ ఒంటరిగా అధిక సీట్లు సాధిస్తుండడం, పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో అద్భుత ఫలితాలు సాధించడంపై పార్టీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయింది. అక్కడ ఈసారి అనూహ్యంగా ఫలితాలు రావడంతో పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కూడా చతికిల పడ్డ బీజేపీ ఇప్పుడు అక్కడ కూడా జోరు కొనసాగిస్తుండడం గమనార్హం.  దక్షిణాదిలోనూ బీజేపీ గతంతో పోలిస్తే భారీగా పుంజుకున్నట్లు ఫలితాలు తెలియజేస్తున్నాయి.

  • Loading...

More Telugu News