Hyderabad: మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు

  • మొత్తం 12 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ సిట్
  • ఇందులో నాలుగు కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు
  • మరో 8 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న సిట్  

 గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదు చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఇందులో నాలుగు కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరో 8 కేసుల్లో ఛార్జిషీట్ ను దాఖలు చేయనుంది. కాగా, డ్రగ్స్ కేసు విషయమై ఎక్సైజ్ శాఖ సిట్ మూడు నెలల పాటు విచారణ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు మొత్తం 62 మంది ఉన్నారు. అప్పట్లో వీరి నుంచి గోళ్లు, జుట్టు నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం  పంపారు. ఇప్పటికే దాఖలైన నాలుగు ఛార్జిషీట్ లలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లను చేర్చలేదు.  

  • Loading...

More Telugu News