Cricket: టీ20 మ్యాచ్ ల్లో విజేతను ఊహించడం చాలా కష్టం... ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై హీరో వెంకటేశ్ విశ్లేషణ

  • చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్సీ ఉపకరిస్తుంది
  • ముంబయిని తక్కువ అంచనా వేయలేం
  • నేడు హైదరాబాద్ లో ఐపీఎల్ ఫైనల్

సిసలైన క్రికెట్ అభిమానికి ప్రతీకలా కనిపించే టాలీవుడ్ అగ్రహీరో వెంకటేశ్ ఇప్పుడు ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్ పై దృష్టి పెట్టారు. క్రికెట్ అంటే పడిచచ్చే వెంకటేశ్ హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందంటే చాలు సగటు అభిమానిలా చేతిలో జెండాతో ప్రత్యక్షమవుతారు. పోరు ముగిసేంతవరకు ఎంతో ఉత్సాహంగా హర్షాతిరేకాలతో తన అభిమాన జట్లను ప్రోత్సహిస్తుంటారు. తాజాగా, హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.

అయితే, టైటిల్ కోసం బరిలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ లో కచ్చితంగా టైటిల్ గెలిచే టీమ్ ను మాత్రం వెంకీ చెప్పలేకపోయారు. "వాస్తవానికి చెన్నై, ముంబయి జట్లు రెండూ బలమైనవే. టీ20 గేమ్ లో విజేతను ముందుగా ఊహించడం చాలా కష్టమైన పని. చెన్నైకి ధోనీ కెప్టెన్సీ ఎంతో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అలాగని ముంబయి ఇండియన్స్ ను తక్కువగా అంచనా వేయలేం. స్లోగా స్టార్ట్ చేసినా ఆపై పుంజుకుని ఫైనల్ వరకు వచ్చారు" అంటూ మ్యాచ్ పై విశ్లేషణ వినిపించారు.

  • Loading...

More Telugu News