New Delhi: ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో మామిడి పండ్ల విక్రయశాల ఏర్పాటు

  • ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించిన అధికారులు
  • జూన్‌ 25వ తేదీ వరకు కొనసాగనున్న అమ్మకాలు
  • రాజధాని వాసులకు ఏపీ రుచులు అందించాలనే అన్న అధికారులు

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్‌లో మామిడి పండ్ల విక్రయశాల ఏర్పాటైంది. రాజధాని వాసులకు ఆంధ్రా ఫేమస్‌ బంగినపల్లి మామిడి పండ్లు రుచి చూసే అవకాశం కల్పించేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌, ఓఎస్డీ భావనా సక్సేనాతో కలిసి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత కార్యదర్శి నీలం సహానీ ఈ విక్రయశాలను నిన్నప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ ఏపీ మార్క్‌ఫెడ్‌ సహాయంతో ఈ కేంద్రంలో నాణ్యమైన బంగినపల్లి, చెరకురసాలు, ఇమామ్‌ పసంద్‌, సువర్ణ రేఖ వంటి రకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. జూన్‌ 25వ తేదీ వరకు ఈ విక్రయశాల ఉంటుందని, నాలుగు కిలోల బుట్ట రూ.400కు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News