Telugudesam: టీడీపీకి 120 సీట్లు.. చంద్రబాబే మళ్లీ సీఎం: టీడీపీ నేత ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్

  • ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి ఏపీలో జరిగింది
  • ఆ అభివృద్ధే చంద్రబాబును మళ్లీ సీఎంను చేయబోతోంది
  • న్యూజెర్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసాద్

తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోందని టీడీపీ జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. అమెరికాలోని న్యూజెర్సీలో నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఎన్నారై టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీకి 120 సీట్లు రాబోతున్నాయని చెప్పారు. మళ్లీ చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి ఏపీలో జరిగిందని చెప్పారు. ఆ అభివృద్ధే చంద్రబాబును మళ్లీ సీఎం చేయబోతోందని అన్నారు. రూ. 16 వేల ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంలో ఇంత స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News