kavitha: పోతంగల్ లో ఓటు వేసిన కవిత

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన కవిత
  • టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందంటూ ధీమా
  • ఈ సారి కూడా వార్ వన్ సైడే అంటూ వ్యాఖ్య

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓటు వేశారు. నవీపేట్ మండలం పోతంగల్ లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీల గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించి, గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో కూడా వార్ వన్ సైడే ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ది కోసం అన్ని పార్టీలను ఏకం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News