India: మ్యాచ్ జరుగుతుందో, లేదో తెలియదు.. కానీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి!

  • జూన్ 16న ఇండియా-పాక్ మ్యాచ్
  • ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
  • 48 గంటల్లో టికెట్లన్నీ అమ్మకం

ఇండియా-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం ఈ రెండు దేశాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ పై ఆసక్తిని చూపుతారు. ఇక వరల్డ్ కప్ జరిగే మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ లో దాయాది దేశాల మధ్య జరగనున్న మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. జూన్ 16న మాంచెస్టర్ లో ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు మొదలు పెట్టిన 48 గంటల్లోనే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు, పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్లు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. దీంతో, ఈ మ్యాచ్ జరుగుతుందో, లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ, క్రికెట్ ప్రేమికులు మాత్రం దీన్నేమీ పట్టించుకోకుండా... టికెట్లను సొంతం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News