Andhra Pradesh: విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

  • నేలపాలైన ఉక్కుద్రవం
  • కోట్లాది రూపాయల ఆస్తినష్టం
  • మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది

విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ లో ఇవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని సీసీడీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో  ఎంతో విలువైన ఉక్కుద్రవం పెద్దమొత్తంలో నేలపాలైంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాడిల్ గేట్ బ్రేక్ పడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

  • Loading...

More Telugu News