modi: మరి, అద్వాణీకి మీరు చేసిందేమిటి?: మోదీకి బాబు సూటిప్రశ్న

  • ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని మోదీ అంటారా!
  • ప్రజాస్వామ్యంపై మండేలా మాటలు మోదీకి సరిపోతాయి
  • మోదీకి ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదు

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన అన్యాయానికి ఆయన ఆత్మ క్షోభిస్తుందని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.అమరావతిలో ప్రజావేదికలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని గుంటూరులో మోదీ ఇటీవల వ్యాఖ్యలు చేశారని, మరి, అద్వాణీకి మీరు చేసింది ఏమిటి? అంటూ మోదీకి సూటి ప్రశ్న వేశారు. ప్రజాస్వామ్యంపై నెల్సన్ మండేలా చెప్పిన మాటలు మోదీకి సరిపోతాయని అన్నారు.

ఏపీలో అభివృద్ధిని చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని, పన్నులు కట్టించుకుంటున్నారే తప్ప న్యాయం చేయడం లేదని విమర్శించారు. మోదీకి ఏపీ గురించి మాట్లాడే అర్హత లేదని దుమ్మెత్తిపోశారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ, మోదీపై ఏపీ ప్రజలకు ఆవేదన, ఆక్రోశం, బాధ, కోపం ఉన్నాయని అన్నారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని తెలుసుకుందని, అందుకే, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 

  • Loading...

More Telugu News