nikhil: ఆసక్తిని రేకెత్తించే నేపథ్యంలో 'కార్తికేయ' సీక్వెల్

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • మొదలైన సీక్వెల్ పనులు 
  • ఇతర భాషల్లోను విడుదల

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ - స్వాతి జంటగా నటించిన 'కార్తికేయ' 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.

 ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల చివరి వారంలోగానీ, వచ్చేనెల మొదటివారంలోగాని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'కుంభమేళ' నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతుందట. కథ ప్రకారం ఈ సినిమాను ఉత్తరాఖండ్ .. హిమాచల్ ప్రదేశ్ లలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. తొలిభాగంలో వున్న ఆర్టిస్టులతో పాటు, మరో కథానాయిక కూడా ఉంటుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. 

  • Loading...

More Telugu News