Mahesh Babu: "మీరంటే చచ్చిపోతాను సార్" అన్న అభిమానిని ఆప్యాయంగా హత్తుకున్న మహేశ్ బాబు

  • మాట్లాడుతుండగా మధ్యలో వచ్చిన యువకుడు
  • ప్రసంగం ఆపేసిన మహేశ్
  • యువకుడ్ని తీసుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేశ్ సరసన స్లిమ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో మహేశ్ బాబు మాట్లాడుతూ, తను నటించిన సినిమాల దర్శకులను పేరుపేరునా స్మరించుకున్నారు. రాఘవేంద్రరావు మొదలుకొని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

మహేశ్ బాబు మాట్లాడుతుండగా, బొద్దుగా ఉన్న ఓ యువకుడు వేదికపైకి దూసుకొచ్చాడు. ఆ యువకుడ్ని చూసి మహేశ్ బాబు తన ప్రసంగాన్ని ఆపారు. ఆ యువకుడు, "మీరంటే చచ్చిపోతాను సార్" అనడంతో థ్యాంక్స్ చెప్పడమే కాకుండా ఆప్యాయంగా హత్తుకుని ఆ అభిమానిని సంతోషపెట్టారు. ఆపై సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ యువకుడ్ని అక్కడ్నించి తీసుకెళ్లారు.

  • Loading...

More Telugu News