ram: కాశీలో 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్

  • పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
  • డిఫరెంట్ లుక్ తో రామ్ 
  • రామ్ సరసన ఇద్దరు నాయికలు     

రామ్ తాజా చిత్రంగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను 'కాశీ'లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి కాశీలో ఈ సినిమా షూటింగు జరగనుంది. రామ్ తదితరులపై యాక్షన్స్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని ఛార్మీ అధికారికంగా తెలియజేసింది.

లవ్ అండ్ రొమాన్స్ ను కలుపుకుని యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేశ్ కనిపించనున్నారు. కొత్త లుక్ తో .. కొత్త బాడీ లాంగ్వేజ్ తో .. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. 

  • Loading...

More Telugu News