20: కొత్త రూ. 20 నోటుకు సంబంధించిన ఆసక్తికర వివరాలు!

  • ఆకుపచ్చ, పసుపు మిశ్రమ రంగులో నోట్ల ముద్రణ
  • ఓవైపు గాంధీ బొమ్మ, అశోక స్తూపం 
  • మరోవైపు ఎల్లోరా గుహల చిత్రం

కొత్త రూ. 20 నోటును ప్రవేశపెడుతున్నట్టు ఈరోజు ఆర్బీఐ ప్రకటించింది. మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోట్ల గురించి కొన్ని ఆసక్తి వివరాలు.

  • నోటు సైజు 63 మి.మీ x 129 మి.మీ. 
  • నోటు ఒక వైపున్న సీత్రూ ప్రాంతంలో 20 సంఖ్య కనిపిస్తుంది. దేవనాగరి లిపిలో కూడా ఈ నంబర్ ఉంటుంది.  
  • నోటుకు ఒక వైపు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. ఆర్బీఐ, భారత్, ఇండియా, 20 కనిపిస్తాయి. 
  • గాంధీకి కుడివైపున ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి. 
  • గాంధీ బొమ్మకు మరోవైపున అశోక స్తూపం, 20 సంఖ్య వాటర్ మార్క్ లు ఉంటాయి. 

  • నోటుకు మరోవైపున ఎడమపక్కన నోటును ప్రింట్ చేసిన సంవత్సరం ఉంటుంది. స్వచ్ఛభారత్ నినాదంతో పాటు లోగో ఉంటుంది. 
  • అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. 
  • ఎల్లోరా గుహల చిత్రం ముద్రించి ఉంటుంది. 
  • ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు మిశ్రమ రంగుతో ముద్రించి ఉంటాయి.

  • Loading...

More Telugu News