Anantapur District: పరిటాల శ్రీరామ్ అనుచరులపై కేసు నమోదు

  • నాగసముద్రంలో వైసీపీ కార్యకర్తలపై నిన్న దాడి
  • పరిటాల అనుచరులపై వైసీపీ ఆరోపణలు
  • ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

అనంతపురం జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగసముద్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై నిన్న వేట కొడవళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ, ఎన్ఎస్ గేటు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిన్న ఆందోళనకు దిగారు.  

  • Loading...

More Telugu News