Telangana: ఈ నెల 27న వరంగల్ మేయర్ ఎన్నిక

  • టీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం
  • మేయర్ ఎన్నికల ఇన్ ఛార్జిగా బాలమల్లు నియామకం
  • ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన

ఈ నెల 27న వరంగల్ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కసరత్తు ముమ్మరమైంది. మేయర్ ఎన్నికల ఇన్ ఛార్జిగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాలమల్లును నియమించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక టీఆర్ఎస్ నేతలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని ఆయన ఓ నివేదిక అందించనున్నారు. వరంగల్ లోని సీనియర్ నాయకులతో పాటు పార్టీలో ముఖ్యనాయకులందరి అభిప్రాయాలు సేకరించి కేసీఆర్ కు బాలమల్లు ఈ నివేదికను అందజేస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News