sensex: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • ఆటో, బ్యాంకింగ్ స్టాకులకు అమ్మకాల ఒత్తిడి
  • మార్కెట్లపై ప్రభావం చూపుతున్న ముడి చమురు అంశం
  • 80 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆటోమొబైల్, బ్యాంకింగ్ దిగ్గజాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం మార్కెట్లను నష్టాల్లోకి నడిపించాయి. ముడి చమురు అంశం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 80 పాయింట్లు నష్టపోయి 38,564కు పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (3.93%), సన్ ఫార్మా (3.08%), బజాజ్ ఫైనాన్స్ (1.47%), కోల్ ఇండియా (1.45%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.38%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-3.60%), యస్ బ్యాంక్ (-2.33%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.18%), టాటా స్టీల్ (-2.15%), హీరో మోటో కార్ప్ (-1.74%).

  • Loading...

More Telugu News