sudhakar: ప్రభాస్ చేతుల మీదుగా 'నువ్వు తోపురా' ట్రైలర్ రిలీజ్

  • తెలుగు తెరకి మరో ప్రేమకథ
  •  కీలకమైన పాత్రలో నిరోషా
  • మే 3వ తేదీన విడుదల  

తెలుగు తెరపై ప్రేమకథల జోరు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్లనే ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా నిర్మితమవుతూ ఉంటాయి. ప్రేక్షకులను పలకరించడానికి మరో ప్రేమకథ సిద్ధమవుతోంది. సుధాకర్ .. నిత్య నాయకా నాయికలుగా హరినాథ్ బాబు దర్శకత్వంలో 'నువ్వు తోపురా' సినిమా రూపొందింది. నాయకా నాయికలు ఇద్దరూ ఈ సినిమాతోనే పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను 'ప్రభాస్' చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఒక తెలంగాణ కుర్రాడి జర్నీగా .. మాస్ అంశాలతో ఈ సినిమా నిర్మితమైందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్, యూత్ ను ఆకట్టుకునేలా వుంది. సీనియర్ హీరోయిన్ నిరోషా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మే 3వ తేదీన విడుదల చేయనున్నారు.

sudhakar
nithya
  • Error fetching data: Network response was not ok

More Telugu News