Andhra Pradesh: పక్కా ప్లాన్ ప్రకారమే దాడి.. సూత్రధారి అతడే: కోడెల

  • దాడి చేయించింది అంబటి రాంబాబే
  • టీడీపీ నేతలను భయపెట్టి తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అనుకున్నారు
  • మోదీ కూడా చంద్రబాబును ఓడించాలని చూశారు

పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరిగిందని ఏపీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ అన్నారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబే ఈ దాడికి సూత్రధారి అని ఆరోపించారు. మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన తనపై దాడి చేసి రాష్ట్రమంతటా భయాందోళనలు సృష్టించాలని వైసీపీ నేతలు భావించారన్నారు. ఆ తర్వాత తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని అనుకున్నారని అన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ కూడా చంద్రబాబును ఓడించాలని చూశారని, వ్యవస్థలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తమకు ఏం కావాలో ఇక్కడి ప్రజలకు తెలుసని, అందుకనే జనం టీడీపీకి ఓటేశారని అన్నారు.

Andhra Pradesh
Kodela sivaprasad
Guntur District
sattenapalli
Ambati rambabu
  • Loading...

More Telugu News