sunil: మిలియన్ వ్యూస్ కోసం నన్ను చంపాలా?: కమెడియన్ సునీల్ ఆవేదన

  • రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయినట్టు రాశారు 
  • మిలియన్ వ్యూస్ కోసం ఇలా చేశారు
  •  అప్పుడే ఆ బాధ అవతలవారికి తెలుస్తుంది

హీరోగా ఆశించినస్థాయిలో విజయాలు దక్కకపోవడం .. సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ ఎక్కువగా వస్తుండటంతో, తిరిగి కమెడియన్ గా కొనసాగాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి ఆయన కమెడియన్ గా చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'చిత్రలహరి' ప్రస్తుతం థియేటర్లలో వుంది. తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ .. ఇటీవల తను చనిపోయినట్టుగా వచ్చిన పుకార్లపై స్పందించాడు.

"సోషల్ మీడియా కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఒక వెబ్ సైట్ వాళ్లు .. రోడ్డు ప్రమాదంలో నేను చనిపోయానని రాసేశారు. ఆ వార్త వలన వాళ్లకి ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక మిలియన్ వ్యూస్ కోసం నన్ను చంపేస్తారా? ఇలాంటి వార్త కారణంగా ఆ ఇంట్లో వాళ్లు ఎంత బాధపడతారో తెలియాలంటే, ఇలాంటి వార్తను రాసినవారి కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్త వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏ వార్తనైనా నిజానిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News