చంద్రబాబుకు సాంకేతిక సలహాదారు హోదాలోనే హరిప్రసాద్ వచ్చారు!: ఈసీకి టీడీపీ నేత కనకమేడల లేఖ
- గతంలో ఈసీకి మేం చాలా లేఖలు రాశాం
- హరిప్రసాద్ రాకపై ఈసీ అభ్యంతరం లేవనెత్తడంపై ఆగ్రహం
- ఈవీఎంల్లో లోపాలను హరిప్రసాదే గుర్తించారన్న కనకమేడల
ఈ విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఈవీఎంల పనితీరును అమెరికా, నెదర్లాండ్స్ పరిశోధకులతో కలిసి ఆయన అధ్యయనం చేశారన్నారు. ఏపీ సీఎంకు సాంకేతిక సలహాదారు హోదాలోనే హరిప్రసాద్ ముందుకు వచ్చారని కనకమేడల స్పష్టం చేశారు. ఓ సాంకేతిక నిపుణుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని తేల్చిచెప్పారు. ఈవీఎంలపై రేపు ఈసీ సాంకేతిక కమిటీతో చర్చించే అవకాశం కల్పించాలని కోరారు.